Cochliobolus lunatus
శీలీంధ్రం
5 mins to read
ప్రారంభంలో, లేత-రంగు వలయాలతో చిన్న చనిపోయిన మచ్చలు ఏర్పడతాయి. ఇవి 0.5 సెం.మీ. వరకు వ్యాసం కలిగి ఉంటాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ వలన ఆకు మొత్తం పసుపు రంగులోకి మారుతుంది. గింజలపై మచ్చలు మరియు బూజు కనిపిస్తాయి, చివరికి విత్తనాలు ఎండిపోవడం మరియు విత్తనాల అంకురోత్పత్తి వైఫల్యం చెందడం జరుగుతుంది. ఆకులు నిర్జీవ ప్రాంతాలతో అసాధారణ రంగులను ప్రదర్శించవచ్చు. రంగు కోల్పోవడం, గింజలపై మచ్చలు, బూజు మరియు కుళ్లిపోవడం వంటి లక్షణాలను గింజలు ప్రదర్శిస్తాయి.
ఈ రోజు వరకు, ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ నియంత్రణ విధానం గురించి మాకు తెలియదు. వ్యాధి సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మాంకోజెబ్, క్లోరోతలోనిల్ మరియు మనేబ్ వంటి శిలీంద్ర నాశినులను వాడండి.
సి. లూనాటస్ యొక్క శిలీంధ్రాల వల్ల లక్షణాలు సంభవిస్తాయి. గాలిలో వుండే కొనిడియా మరియు అస్కోస్పోర్స్, వర్షపు నీరు తుంపర్లు మరియు నీటి పారుదల ద్వారా ఈ సంక్రమణ సంభవిస్తుంది మరియు పాత పంట అవశేషాల ద్వారా నేలలో కూడా జీవించవచ్చు. సాధారణంగా 24-30°C యొక్క సరైన ఉష్ణోగ్రతల్లో, వేడి మరియు తేమతో కూడిన ప్రాంతాల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.